Share News

Flood Relief: ‘నారాయణ’ విరాళం రూ.2.50 కోట్లు

ABN , Publish Date - Sep 19 , 2024 | 04:22 AM

వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు, పలు సంస్థలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి చెక్కులు అందిస్తున్నారు.

Flood Relief: ‘నారాయణ’ విరాళం రూ.2.50 కోట్లు

  • శ్రీరామ్‌ చిట్స్‌ రూ.కోటి అందజేత

వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు, పలు సంస్థలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి చెక్కులు అందిస్తున్నారు. బుఽధవారం నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు శరణి, పునీత్‌ రూ.2.50 కోట్లు అందించారు. శ్రీరామ్‌ చిట్స్‌ ఎండీ వైఎస్‌ చక్రవర్తి రూ.కోటి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు తరపున బ్యాంకు చైర్‌పర్సన్‌ వై.శోభ రూ.50 లక్షలు, టెక్నో పెయింట్స్‌ తరపున ఆ సంస్థ డైరెక్టర్లు ఆకునూరి శ్రీనివాసరెడ్డి, సీవీఎల్‌ఎన్‌ మూర్తి, అనిల్‌ రూ.20 లక్షలు ఇచ్చారు.


అసోసియేషన్‌ ఆఫ్‌ లేడీ ఆంత్రప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఇండియా తరపున కన్నెగంటి రమాదేవి, దుర్గాభవాని, పల్లవి రూ.5 లక్షలు, మోల్డ్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ తరపున వైస్‌ ప్రెసిడెంట్‌ రాణా రూ.25 లక్షలు అందించారు.

Updated Date - Sep 19 , 2024 | 04:22 AM