కేసీఆర్ను పరామర్శించిన మాజీ గవర్నర్ నరసింహన్
ABN , Publish Date - Jan 08 , 2024 | 05:07 AM
ఇటీవల తుంటికి ఆపరేషన్ జరిగి కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ను ఆదివారం మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శించారు.
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల తుంటికి ఆపరేషన్ జరిగి కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ను ఆదివారం మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులను మాజీ మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న నరసింహన్.. త్వరలో పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధిలో నరసింహన్ అందించిన సహకారం, రాష్ట్ర ఏర్పాటు, అనంతర పరిణామాలు, ఇతర అంశాలపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించుకున్నారు. నరసింహన్ దంపతులకు కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ పట్టు వస్త్రాలిచ్చి సంప్రదాయ పద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివా్సగౌడ్, కొప్పులఈశ్వర్, ఎంపీ సంతోష్ కుమార్, బీబీ పాటిల్ పాల్గొన్నారు.