Share News

పురాణపండ ‘శ్రీ లలిత విష్ణుసహస్రనామస్తోత్రమ్’ ఉచితం: గురుపూర్ణిమ నాడు రమణాచారిచే శ్రీకారం

ABN , Publish Date - Jul 17 , 2024 | 11:56 PM

ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా అందిన మూడు వందల పేజీల అమోఘ గ్రంధం ‘శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ గ్రంధాన్ని జంట నగరాల సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థలకు, వేద పాఠశాలలకు, అర్చకులకు, వేదపండితులకు ఉచితంగా వితరణ చేయనున్నట్లు ప్రఖ్యాత సాంస్కృతిక కళా వేదిక ‘త్యాగరాయ గాన సభ’ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి పేర్కొన్నారు. గురుపూర్ణిమకు ముందు రోజున ఈ మంగళగ్రంధాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి. రమణాచారి ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు.

పురాణపండ ‘శ్రీ లలిత విష్ణుసహస్రనామస్తోత్రమ్’ ఉచితం: గురుపూర్ణిమ నాడు రమణాచారిచే శ్రీకారం

హైదరాబాద్, జులై 17: యుగాలుగా ఈ జగత్తుని పులకితం చేస్తున్న ఋషుల వర ప్రసాదాలైన సుమారు వందకు పైగా స్తోత్ర, వ్యాఖ్యాన నిధులతో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా అందిన మూడు వందల పేజీల అమోఘ గ్రంధం ‘శ్రీ లలితా విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ గ్రంధాన్ని జంట నగరాల సాహిత్య సాంస్కృతిక ఆధ్యాత్మిక సంస్థలకు, వేద పాఠశాలలకు, అర్చకులకు, వేదపండితులకు ఉచితంగా వితరణ చేయనున్నట్లు ప్రఖ్యాత సాంస్కృతిక కళా వేదిక ‘త్యాగరాయ గాన సభ’ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి పేర్కొన్నారు.

గురు పూర్ణిమ ఉదయం తొమ్మిది గంటల నుండీ సాయంకాలం ఆరు గంటలవరకూ ముషీరాబాద్ గాంధీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న జ్ఞాన సరస్వతీ దేవాలయంలో తమ ఒరిజినల్ గుర్తింపు కార్డు‌తో వచ్చే పై విభాగాల వారికి ఈ గ్రంధాన్ని ఉచితంగా అందజేస్తామని ఆయన చెప్పారు.

Lalitha-Vishnu-KVR.jpg

ఈ మంత్ర ప్రసాద వితరణ శ్రీకార్యానికి స్ఫూర్తిదాయకమైన ప్రోత్సాహాన్నిచ్చిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పూర్వ ప్రత్యేక సలహాదారులు, సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి. రమణాచారికి జనార్ధనమూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అద్భుతాలు పై లోకాల నుండి ఊడిపడవని, మహా సాధనతోనే దైవీయ స్పృహల అంశాలు అనుభూతుల్ని ఆవిష్కరిస్తాయని ఎన్నో అపురూప రచనలతో, సంకలనాలతో నిరూపించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నిస్వార్ధ యజ్ఞ భావనను ఈ సందర్భంగా జనార్ధనమూర్తి ప్రశంసించారు. భావజాలపరీవ్యాప్తి కోసమే ఈ శ్రీకార్యాన్ని భుజాన వేసుకుని తామంతా శ్రీసరస్వతీసేవకు ఉపక్రమించామని ఆయన చెప్పడం విశేషం.

KVR.jpg

గురుపూర్ణిమకు ముందు రోజున ఈ మంగళగ్రంధాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి. రమణాచారి ఆవిష్కరిస్తారు. జంటనగరాల చరిత్రలో మూడువందల పేజీల దివ్య గ్రంధాన్ని అర్చక వేదపండితులకు, ధార్మిక సాంస్కృతిక సంస్థలకు ఉచితంగా వితరణ చెయ్యడం ఇదే ప్రథమమని నగరంలోని సాంస్కృతిక కళాసంస్థలు త్యాగరాయ గానసభ పాలకవర్గాన్ని అభినందిస్తున్నాయి.

Updated Date - Jul 18 , 2024 | 12:29 AM