Share News

కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు

ABN , Publish Date - May 09 , 2024 | 06:28 AM

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత ముక్కా సాంబశివరాజు సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గతంలో

కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు

సీఎం సమక్షంలో చేరిన బీఆర్‌ఎస్‌ నేత ముక్కా సాంబశివరాజు

హైదరాబాద్‌, మే 8(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత ముక్కా సాంబశివరాజు సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గతంలో టీడీపీలోనూ పని చేసిన ఆయన.. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. కేసీఆర్‌ తీరు నచ్చక, సీఎం రేవంత్‌రెడ్డి పథకాలకు ఆకర్షితుడినయ్యి తాను హస్తం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అలాగే తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోశిక యాదగిరి, కార్యదర్శి నారా నరసింహ, పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్‌, అప్కో మాజీ చైర్మన్‌ గోశిక పాండు తదితరులూ దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Updated Date - May 09 , 2024 | 06:28 AM