Share News

Padi Koushik Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలి పెట్టం

ABN , Publish Date - Apr 11 , 2024 | 02:07 PM

పార్టీ మారిన దానంపై తాము ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకూ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు డిస్ క్వాలి ఫై అవ్వక తప్పదన్నారు.

Padi Koushik Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలి పెట్టం

హైదరాబాద్: పార్టీ మారిన దానంపై తాము ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకూ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padi Kaushik Reddy) తెలిపారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు డిస్ క్వాలి ఫై అవ్వక తప్పదన్నారు. తాము అసెంబ్లీకి వెళ్లి పిటిషన్ ఇద్దామంటే సెక్రెటరీ బాత్ రూంలో దాక్కున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలి పెట్టబోమన్నారు. వారి ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని హెచ్చరించారు. దానం, కడియం, తెల్లంకు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.


ఇవి కూడా చదవండి..

Big Breaking: ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్..

YSRCP: లిస్ట్‌లో ట్విస్ట్.. కడప ఎంపీ అభ్యర్థిని మారుస్తున్న వైసీపీ!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 11 , 2024 | 03:05 PM