Home » Telangana
తెలంగాణ వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో రానున్న 3రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు 4 జిల్లాలకు భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రేపు భద్రాది కొత్తగూడం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
నాలుగో దశ పోలింగ్కు సర్వం సిద్దమైంది. ఈ దశలో మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), బిహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్ ఒక సీటుకు పోలింగ్ జరగనుంది.
తెల్లవారితే రాష్ట్రంలో ఓట్ల పండగ. ఇప్పటికే దేశంలో జరిగిన మూడు విడతల లోక్సభ ఎన్నికల్లో అంతంతమాత్రంగా ఓటింగ్ శాతం నమోదైంది. దీంతో నాలుగో విడత పోలింగ్ను సీరియ్సగా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఎలాగైన ఓటింగ్ను పెంచాలని సంకల్పించింది.
Telangana: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్త తెలిపారు. ఆదివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని కోరారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Andhrapradesh: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
రేపే ఎన్నికల పండుగ. సామాన్యులతో పాటు సెలబ్రిటీలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెక్కడ వినియోగించుకోనున్నారంటే.. ఓబుల్రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్ .. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేశ్బాబు, నమ్రత , మంచు మోహన్బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, జీవిత, రాజశేఖర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్ సభ ఎన్నికల నిర్వహణకు నిజామాబాద్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తైంది. ఎన్నికల సిబ్బంది విధులకు బయలుదేరుతోంది. పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో మొత్తం 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం 17,04,867 మంది ఓటర్లున్నారు.
Telangana: పోలింగ్కు మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్ , హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. రెండు పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్లో ఈవీఎంల పంపిణీని జీహేచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.
రూ.10 ఇస్తే వీవీ ప్యాట్ స్లిప్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఓటు వేసిన తర్వాత ఎన్నికల అధికారి సదరు ఓటరు వీవీ ప్యాట్ స్లిప్ ఇవ్వమని అడుగుతారు. అందుకోసం రూ.10 చెల్లిస్తే చాలు స్లిప్ ఇస్తారని తెలిసింది.
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుంటారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అభ్యర్థులు టెన్షన్కు గురి అవుతుంటారు. స్వతంత్ర్య అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ సమస్య వణికిస్తోంది. తమ లాంటి గుర్తు మరో అభ్యర్థికి కేటాయిస్తే ఓటరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకరికి వేసే ఓటు మరొకరి వేస్తారు. అలా ఎక్కువ మంది గందరగోళానికి గురయితే గెలిచే అభ్యర్థి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.