రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
ABN , Publish Date - Mar 14 , 2024 | 11:56 PM
నల్లగొండ జిల్లా చింతపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందాడు.
చింతపల్లి, మార్చి 14: నల్లగొండ జిల్లా చింతపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందాడు. ఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని హరిజనపురం గ్రామానికి చెందిన తంగెళ్ల పెద్దలక్ష్మయ్య(65) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బంధువుల శుభకార్యానికి భార్యతో కలిసి టీవీఎస్ వాహనంపై రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అన్నబోయినపల్లి గ్రామానికి గురువారం వెళ్లాడు. శుభకార్యం అనంతరం స్వగ్రామానికి బ యలుదేరారు. చింతపల్లి మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్బంక్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వైపు వెళుతున్న హోండాసిటీ కారు టీవీఎస్ వాహనాన్ని వెనుకనుంచి బలంగా ఢీకొట్టి పల్టీ కొట్టింది. టీవీఎస్పై ఉన్న పెద్దలక్ష్మయ్య తీవ్రంగా గాయపడి అక్కడి కక్కడే మృతిచెందాడు. భార్య జంగమ్మకు తీవ్ర గాయాలయ్యా యి. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ యాదయ్య సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రగాయాలైన జంగమ్మను దేవరకొండలోని ఆస్ప త్రికి తరలించారు. లక్ష్మయ్యకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కు మార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని దేవరకొండ సివిల్ ఆసుపత్రికి త రలించారు. లక్ష్మయ్య సోదరుడు వెంకులు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదయ్య తెలిపారు.