18న ప్రతిభ పురస్కారాల ప్రదానం
ABN , Publish Date - May 15 , 2024 | 11:53 PM
ప్రభు త్వ పాఠశాలల్లో మెరుగైన ఫ లితాలు రాబట్టిన ప్రధానోపా ధ్యాయులకు ప్రతిభ పురస్కారాలను అందజేయనున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ వైస్ చైర్మన యానాల ప్రభాకర్రెడ్డి తెలిపారు.
18న ప్రతిభ పురస్కారాల ప్రదానం
నల్లగొండ, మే 15: ప్రభు త్వ పాఠశాలల్లో మెరుగైన ఫ లితాలు రాబట్టిన ప్రధానోపా ధ్యాయులకు ప్రతిభ పురస్కారాలను అందజేయనున్నట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ వైస్ చైర్మన యానాల ప్రభాకర్రెడ్డి తెలిపారు. బుధవారం డీఈవో బొల్లారం బిక్షపతిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ మండలంలోని 27 ప్రభుత్వ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో 79 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆయన తెలిపారు. వారికి విశిష్ట సేవలు అందించిన 27 మంది ప్రధానోపాధ్యాయులకు ప్రతిభ పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీన జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల కాళోజీ ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో పురస్కారాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా నల్లగొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు కృషి చేసిన హెచఎంలకు అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డీఈవో, డైట్ ప్రిన్సిపాల్ నర్సింహ, డీసీఈబీ సెక్రటరీ కొమ్ము శ్రీనివాస్, నల్లగొండ ఎంఈవో కొమ్ము అరుంధతి, గాంధీ గ్లోబల్ ప్యామిలీ ఛీప్ అడ్వైజర్ గోనారెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.