రఘువీర్రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:08 AM
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు.
రఘువీర్రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి
మాడ్గులపల్లి, ఏప్రిల్ 13: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. మండలంలోని మాచనపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన 20 కుటుంబాలు శనివారం చేకూరి హన్మంతరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి జానారెడ్డి సమక్షంలో కాం గ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలుచేసి పేదలను ఆదుకుందని అన్నారు. దేశంలో నరేంద్రమోదీ దేశానికి చేసిందేమీ లేదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రా ష్ట్రంలో 17 స్థానాలు గెలుస్తామని, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థు ల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. మిగిలిన హామీలను ఎలక్షన కోడ్ తర్వాత అమలు చేస్తామని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు మే లు జరగలేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ధర్మాపురం మాజీ సర్పంచ సైదిరెడ్డి, పీఏసీఎస్ డై రెక్టర్ చింతరెడ్డి భాస్కర్రెడ్డి, పార్టీలో చేరిన వారిలో కొండేటి ఇసాక్, యాదయ్య, పెద్ద లింగయ్య, శ్రీను, ప్రకాష్, భాస్కర్, సైదులు, మహేష్, రాజు, సుదర్శన, నా గయ్య, లింగారెడ్డి, బక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.