Share News

అనుమతి లేకుండా షూటింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరిపై కేసు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:56 PM

అనుమతి లేకుండా ఓ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు యూనిట్‌ నిర్వాహకులపై పోచారం ఐటీసీ పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు.

అనుమతి లేకుండా షూటింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరిపై కేసు

ఘట్‌కేసర్‌ రూరల్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేకుండా ఓ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ నిర్వహిస్తున్న ఇద్దరు యూనిట్‌ నిర్వాహకులపై పోచారం ఐటీసీ పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ, చౌదరిగూడ, విజయపురి కాలనీ సూర్య ఆస్పత్రి ఆవరణలో చిరంజీవి వెబ్‌ సిరీస్‌ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా వెబ్‌సిరీస్‌ చిత్రీకరిస్తూ, వరంగల్‌-హైదారాబాద్‌ జాతీయరహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోని చిత్ర యూనిట్‌ నిర్వాహకులైన సల్ల వెంకటేశ్వర్లు, జగదీ్‌షలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 11:56 PM