Share News

కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:06 AM

కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దేముల్‌ మండలం మన్‌సాన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య

పెద్దేముల్‌, ఏప్రిల్‌ 6: కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దేముల్‌ మండలం మన్‌సాన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన అంజు(18) ఇటీవలే ఇంటర్‌ పూర్తిచేసింది. ఆమె కొన్ని రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. శుక్రవారం సాయంత్రం కడుపునొప్పి వస్తోందని కుటుంబ సభ్యులతో చెప్పి ఇంట్లో విశ్రాంతి తీసుకుంది. కుటుంబసభ్యులు అందరూ నిద్రించాక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శవపంచనామా నిర్వహించారు. యువతి తండ్రి లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు.

Updated Date - Apr 07 , 2024 | 12:06 AM