అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించాలి
ABN , Publish Date - Feb 02 , 2024 | 11:37 PM
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే దిశలో ఉపాధ్యాయులు తమ విధులు నిర్వహించాలని మేడ్చల్ ఎంఈవో వసంత కుమారి అన్నారు.
మేడ్చల్ టౌన్, ఫిబ్రవరి 2: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించే దిశలో ఉపాధ్యాయులు తమ విధులు నిర్వహించాలని మేడ్చల్ ఎంఈవో వసంత కుమారి అన్నారు. మేడ్చల్లో శుక్రవారం తన కార్యాలయంలో జిల్లాపరిషత్ ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల కన్న దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలన్నారు. 10వ తరగతి చదివే విద్యార్థులకు సబ్జెక్టు బోధించే విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపినపుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమన్నారు.