రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Jun 10 , 2024 | 11:58 PM
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన తాండూరు-మంతట్టి రైల్వేస్టేషన్ మధ్యలో చోటుచేసుకుంది.
తాండూరు రూరల్, జూన్ 10: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన తాండూరు-మంతట్టి రైల్వేస్టేషన్ మధ్యలో చోటుచేసుకుంది. తాండూరు రైల్వే హెడ్కానిస్టేబుల్ వై.వీరేశం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాయంత్రం తాండూరు-మంతట్టి రైల్వే స్టేషన్ మధ్యన సోమవారం ఓ గుర్తుతెలియని రైలు గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ఒంటిపై నీలిరంగు షర్టు ధరలించి ఉన్నాడని తెలిపారు. గుర్తించిన వారు సెల్ 8712513854 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. వికారాబాద్ స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.