కేంద్ర పథకాలను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:26 AM
కేంద్రం ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్. శ్రీవర్ధన్ రెడ్డి సూచించారు.
కేశంపేట, జనవరి 2: కేంద్రం ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్. శ్రీవర్ధన్ రెడ్డి సూచించారు. మండల పరిధిలోని ఇప్పలపల్లి, పోమాల్పల్లి గ్రామాలలో మంగళవారం వికసిత్ భారత్ సంకల్ప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవర్థన్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. విశ్వకర్మ పథకంలో వృతి పనులు చేసుకునే వారికి బ్యాంకు ద్వార రుణాలు ఇస్తున్నామని తెలిపారు. చివరి వ్యక్తి పథకాలు చేరడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నరని వివరించారు. కేంద్రం అములు చేస్తున్న పథకాలు ప్రజలకు తెలపాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నమని ఆయన తెలిపారు. ఆయా కార్యక్రమాలలో సర్పంచ్లు అంజనేయులు, కృష్ణయ్య, ఉప సర్పంచ్ అనుమగళ్ల రమేష్, కిసాన్మోర్చా జిల్లా ఉపాధ్యాక్షులు మోటే శ్రీనివాస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.