Share News

మతిస్థిమితం లేని వృద్ధురాలు అదృశ్యం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:57 PM

మతిస్థితిమతం లేని వృద్ధురాలు అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

మతిస్థిమితం లేని వృద్ధురాలు అదృశ్యం

ఘట్‌కేసర్‌ రూరల్‌, అక్టోబరు 22 (అంధ్రజ్యోతి): మతిస్థితిమతం లేని వృద్ధురాలు అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ పరశురాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఘట్‌కేసర్‌ మున్సిపల్‌, ఈడబ్ల్యుఎస్‌ కాలనీలో నివాసముంటున్న కడమంచి చంద్రమ్మ(65) గత ఆగస్టు 19న మహబూబ్‌నగర్‌లోని కూతురు ఇంటికి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుటుంబసభ్యులు మహబూబ్‌నగర్‌కు ఫోన్‌చేయగా ఘట్‌కేసర్‌కు తిరిగి బయల్దేరిందని తెలిపారు. అప్పటి నుంచి చంద్రమ్మ కుటుంబసభ్యులు తెలిసిన వారిని, బంధువులను విచారించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రమ్మకు మతిస్థితిమతం సరిగా లేదని తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 11:57 PM