Share News

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం.. యువకుడు మృతి

ABN , Publish Date - Jul 01 , 2024 | 12:11 AM

శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని ఓ టైలర్‌ షాపుకు ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం.. యువకుడు మృతి

శంషాబాద్‌, జూన్‌ 30 : శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని ఓ టైలర్‌ షాపుకు ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆర్జీఐఏ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఊట్‌పల్లి బస్తీలో నివాసముండే అశోక్‌కుమార్‌(23) శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. ఈక్రమంలో అతడు విధులకు వెళుతుండగా.. శంషాబాద్‌-షాబాద్‌ రోడ్డులో ఉన్న ఓ టైలర్‌షాపు వద్దకు వెళ్లాడు. అక్కడ షాపు ఓనర్‌ తన దుకాణానికి సంబంధించిన ఫ్లెక్సీ కట్టమని కోరాడు. అశోక్‌కుమార్‌ ఫ్లెక్సీ తీసుకొని కడుతుండగా.. విద్యుత్‌ వైర్లు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య మేనక టైలర్‌ షాపు యాజమాని తగిన జాగ్రత్తలు తీసుకోకుండా తన భర్తను ఫ్లెక్సీ కట్టమని చెప్పినందునే విద్యుత్‌షాక్‌ తగిలి మృతిచెందాడని ఆరోపించింది. ఈమేరకు యాజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు సీఐ బాల్‌రాజ్‌ తెలిపారు. కేసు ఆర్జీఐఏ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 01 , 2024 | 12:11 AM