మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Jul 18 , 2024 | 12:31 AM
మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించి రూ.28లక్షలకుపైగా నష్టం వాటిల్లింది.
రూ.28లక్షలపైగా నష్టం
ఘట్కేసర్ రూరల్, జూలై 17: మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించి రూ.28లక్షలకుపైగా నష్టం వాటిల్లింది. అవుశాపూర్లోని శ్రీనిధి మద్యం దుకాణం మంగళవారం రాత్రి పదిగంటలకు మూసివెళ్లారు. అర్ధరాత్రి దుకాణం నుంచి పొగలు రావడంతో స్థానికులు పోలీసులకు, షాప్ యజమానికి సమాచారం ఇచ్చారు. షాప్ నిర్వాహకులు, ఫైరింజన్, పోలీసులు మద్యం షాప్ వద్దకు చేరుకొని కరెంట్ను కట్చేశారు. దుకాణంలోని మద్యం సీసాలు, ఫ్రిడ్జ్లు, కౌంటర్ దగ్ధమయ్యాయి. బుధవారం ఉదయం ఎక్సైజ్ ఎస్ఐ నళిని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్తోనే అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. దుకాణంలో రూ.60లక్షలకు పై గా మద్యం నిల్వ ఉందని చెప్పారు. మద్యంతో పాటు కౌంటర్లోని క్యాష్, సీసీ కెమెరాలు, హార్డ్ డిస్కులు, ఫ్రిడ్జ్లతో కలిసి మొత్తం రూ.28లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.