మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి స్వల్ప అస్వస్థత
ABN , Publish Date - Jun 09 , 2024 | 11:35 PM
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కాగా, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరానని, కార్యకర్తలు, అభిమానులెవరూ చింతించవద్దని, తన ఆరోగ్యం కుదుటపడుతోందని పేర్కొన్నారు.
అపోలో ఆస్పత్రిలో చేరిక.. నిలకడగా ఆరోగ్యం
తాండూరు, జూన్ 9: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కాగా, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరానని, కార్యకర్తలు, అభిమానులెవరూ చింతించవద్దని, తన ఆరోగ్యం కుదుటపడుతోందని పేర్కొన్నారు. అయితే, తాను త్వరలో పూర్తిగా కోలుకొని తాండూరుకు వస్తానని రోహిత్రెడ్డి ఆస్పత్రిలో బెడ్పై నుంచి మాట్లాడిన ఓ వీడియో కుటుంబ సభ్యులు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.