ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ABN , Publish Date - Jun 13 , 2024 | 11:53 PM
అక్రమంగా తరలిస్తున్న 688 గ్రాముల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ రూరల్, జూన్ 13 : అక్రమంగా తరలిస్తున్న 688 గ్రాముల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్, దుబాయ్ దేశాల నుంచి వేర్వేరు విమానాల్లో గురువారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న నలుగురు వ్యక్తుల నుంచి గోల్డ్ను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్పోర్టులో అధికారులు బ్యాగులు తనిఖీ చేయగా.. మొత్తం 688 గ్రాముల బంగారు అభరణాలు పట్టుబడ్డాయి. అధికారులు వాటిని సీజ్ చేసి నిందితులను నగరంలోని ప్రధాన కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు.