శంషాబాద్లో వ్యభిచార కేంద్రం గుట్టురట్టు
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:20 AM
శంషాబాద్లో వ్యభిచార కేంద్రం నిర్వాహకురాలిని, ఇద్దరు విటులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్టు ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు.
నిర్వాహకురాలు, ఇద్దరు విటుల అరెస్టు
శంషాబాద్, ఫిబ్రవరి 26: శంషాబాద్లో వ్యభిచార కేంద్రం నిర్వాహకురాలిని, ఇద్దరు విటులను అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్టు ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు. సీఐ బాల్రాజ్ విలేకరులకు వివరాలను వెల్లడించారు. శంషాబాద్లోని రాజీవ్ గృహకల్ప ఇళ్లలో ఖమ్మం నుంచి వచ్చిన కోటీశ్వరి అనే మహిళ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటోంది. మహేశ్వరం మండలానికి చెందిన ఓ మహిళతో వ్యభిచారం నెరుపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కోటీశ్వరి ఉంటున్న ఇంటిపై దాడిచేసి శంషాబాద్ హైమాద్నగర్ బస్తీకి చెందిన ఇద్దరు విటులను, కోటీశ్వరిని అరెస్టు చేశారు. 3 కండోమ్ ప్యాకెట్లు, 3,600 నగదు, 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలిచారు. కాగా, ఇల్లు అద్దెకిచ్చే ముందు వారి వివరాలు, ఆధార్కార్డు తీసుకొని అనుమానంలేదని నిర్ధారించుకోవాలని సీఐ బాల్రాజ్ సూచించారు.