అసంపూర్తిగా భోజనశాల నిర్మాణం
ABN , Publish Date - Apr 05 , 2024 | 11:58 PM
మండలంలోని గొట్టిగఖుర్దు గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో చేపట్టిన భోజనశాల భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి.
బషీరాబాద్, ఏప్రిల్ 5: మండలంలోని గొట్టిగఖుర్దు గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో చేపట్టిన భోజనశాల భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. మనఊరు-మనబడి కింద ఏడాది కిందట ఈ భోజనశాల భవనం మంజూరు కాగా ఫిల్లర్లు వేసి, పైకప్పు రేకులు బిగించారు. అనంతరం ఐదారు నెలలుగా ఎక్కడికక్కడే పనులు నిలిచిపోయాయి. దీంతో చేసిన పనికి బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు పూర్తి చేయలేకపోతున్నానని కాంట్రాక్టర్ వాపోయాడు. ఈ విషయమై సంబంధిత ఏఈ లక్ష్మణ్ను వివరణ కోరగా నిధుల కొరతతో బిల్లులు అందలేదనే విషయం వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వచ్చే విద్యాసంవత్సరం వరకైనా ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.