Share News

కేంద్ర పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరిక

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:00 AM

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహిళలు బీజేపీలో చేరుతున్నారని పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శిరీష అన్నారు.

కేంద్ర పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరిక
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శిరీష

మర్పల్లి, అక్టోబరు 22: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహిళలు బీజేపీలో చేరుతున్నారని పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శిరీష అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం పార్టీ మండల అధ్యక్షుడు రామేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కా ర్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరి, నాయకులు మోహన్‌రెడ్డి, రాంచందర్‌, రాఘవేందర్‌, మల్లికార్జున్‌, నాగయ్య, జంగం సుభాష్‌, యాదవరెడ్డి, అన్నపూర్ణ పాల్గొన్నారు.

ధారూరు: మండలంలోని నాగారంలో బీజేపీ ఆన్‌లైన్‌ సభ్యత్వా నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వడ్ల నందు నాగసమందర్‌, అల్లాపూర్‌ గ్రామాల్లో పర్యటించారు. వారు మాట్లాడుతూ.. దేశ ప్రజలకు సమర్థ పాలన అందిస్తున్న బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఆయా గ్రామాల్లో వారు బీజేపీ ఆన్‌లైన్‌ సభ్యత్వాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రమేశ్‌, నాయకులు పాండుగౌడ్‌, శివమణి, వివేకానంద రెడ్డి, రాజునాయక్‌, అంజయ్య, రాజేందర్‌ గౌడ్‌, మణికంఠ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:00 AM