తాళం వేసిన ఇంటికి కన్నం
ABN , Publish Date - Feb 27 , 2024 | 12:19 AM
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శంకర్పల్లి పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వినాయకరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని బ్లూడ్స్ వెంచర్లో నివాసముంటున్న సునీల్కుమార్ ఈనెల 22న కుటుంబంతో కలిసి ఇంటికి తాళంవేసి మొయినాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు.
శంకర్పల్లి, ఫిబ్రవరి 26 : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శంకర్పల్లి పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వినాయకరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని బ్లూడ్స్ వెంచర్లో నివాసముంటున్న సునీల్కుమార్ ఈనెల 22న కుటుంబంతో కలిసి ఇంటికి తాళంవేసి మొయినాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి ఆదివారం రాత్రి ఇంటికి రాగానే తాళం విరగ్గొట్టి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని దొంగలు తాళం విరగ్గొట్టి 15తులాల బంగారం, రూ.30వేలు ఎత్తుకెళ్లినట్లు యాజమాని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.