వైభవంగా మైసమ్మ బోనాలు
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:57 PM
మండలంలోని సలీంపూర్ గ్రామంలో బుధవారం గ్రామస్థులు బోనాలు వైభవంగా నిర్వహించారు.
దౌల్తాబాద్, జనవరి 3: మండలంలోని సలీంపూర్ గ్రామంలో బుధవారం గ్రామస్థులు బోనాలు వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు బోనపు కుండలతో గ్రామంలోని పురవీధుల మీదుగా ఊరేగింపుగా బయలుదేరి ఆలయంలో ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.