లారీని ఢీకొని వ్యక్తి దుర్మరణం
ABN , Publish Date - Mar 24 , 2024 | 11:58 PM
లారీని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చెక్కలోనిగూడెంలో జరిగింది. ఎస్సై కృష్ణయ్య కథనం మేరకు..
కొందుర్గు, మార్చి 24 : లారీని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చెక్కలోనిగూడెంలో జరిగింది. ఎస్సై కృష్ణయ్య కథనం మేరకు.. చెక్కలోనిగూడెం గ్రామానికి చెందిన బొప్పల రాంచంద్రయ్య(54) ఆదివారం ఉదయం 11 గంటలకు తన గ్రామం నుంచి కొందుర్గుకు అతని ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. మార్గమధ్యలో రోడ్డుపై ఆగి ఉన్న ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో, రాంచంద్రయ్య అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య సైదమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.