Share News

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:03 AM

కుటుంబ కలహాలతో వివాహిత ఇంట్లోనే ఉరివేసుకున్న సంఘటన శంకర్‌పల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

చేవెళ్ల, సెప్టెంబరు 12 : కుటుంబ కలహాలతో వివాహిత ఇంట్లోనే ఉరివేసుకున్న సంఘటన శంకర్‌పల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందిప్పకు చెందిన మల్లేష్‌, అతడి భార్య మౌనిక(26) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పాప, బాబు సంతానం. బుధవారం రాత్రి కుటుంబం విషయం లో భార్యాభర్తలు గొడవపడ్డారు. అర్ధరాత్రి మౌనిక ఇంట్లోనే ఉరేసుకుంది. గురువారం ఉదయం గమనించిన మల్లేష్‌ పోలీసులకు సమాచారం ఇచ్చా డు. పోలీసులు చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చేవె ళ్ల ఆసుపత్రికి తరలించారు. మౌనిక పుట్టింటి వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పురుగుల ముందు తాగి యువతి బలవన్మరణం

మాడ్గుల: పురుగుల మందు తాగిన యువతి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మాడ్గులలో చోటుచేసుకొంది. సీఐ జగదీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులకు చెంది న చిక్కుడు మౌనిక(19) హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. రెండు మూడు రోజుల క్రితం ఆమె ఇంటి కొచ్చిందని తల్లిదండ్రులు అలివేలు, రాములు చెప్పారన్నారు. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయం లో మౌనిక పత్తిచేనుకు కొట్టే పురుగుల మందు తాగి ందని తెలిపారు. తల్లిదండ్రులు పొలం నుంచి వచ్చి చూసేసరికి మౌనిక చావుబతుకుల్లో ఉందన్నారు. ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందూతూ గురువారం మృతిచెందినట్లు సీఐ వివరించారు. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నట్టు సీఐ జగదీష్‌ తెలిపారు. కాగా తన కూతురి ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 13 , 2024 | 07:53 AM