పెండింగ్ పనులను పూర్తి చేయాలి
ABN , Publish Date - Feb 11 , 2024 | 11:58 PM
మహేశ్వరం నియోజకవర్గంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేసేలా చొరవ తీసుకోవాలని కాంట్రాక్టర్లు, అధికారులకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సూచించారు.
మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
తుమ్మలూరు-మహేశ్వరం ప్రధాన రహదారి పనులను పరిశీలన
మహేశ్వరం, ఫిబ్రవరి 11 : మహేశ్వరం నియోజకవర్గంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేసేలా చొరవ తీసుకోవాలని కాంట్రాక్టర్లు, అధికారులకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సూచించారు. ముఖ్యంగా తుమ్మలూరు రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ఆయన తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని తుమ్మలూరు-మహేశ్వరం ప్రధాన రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేఎల్లార్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవైనా సరే నిర్మాణంలో ఉండి అసంపూర్తి ఉన్నవాటిని వెంటనే పూర్తిచేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అవసరమైతే సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి అసంపూర్తి పనులకు మరిన్ని నిధులను విడుదల చేయాలని కోరనున్నట్లు తెలిపారు. తుమ్మలూరు రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లతో మాట్లాడుతానన్నారు. కార్యక్రమంలో నాయకులు ఏనుగు జంగారెడ్డి, ఆమనగంటి ప్రశాంత్రెడ్డి, మహేందర్రెడ్డి, డేనియల్, కొండల్రెడ్డి, రాజునాయక్, యాదగిరి, శేఖర్రెడ్డి, శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు.