ప్రజలు మెచ్చిన పాలన కాంగ్రె్సదే..
ABN , Publish Date - May 27 , 2024 | 12:02 AM
రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన పాలన.. కాంగ్రెస్ పార్టీదేనని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లచ్చంపేట గ్రామంలో ముఖ్యకార్యకర్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
చౌదరిగూడ, మే 26: రాష్ట్రంలో ప్రజలు మెచ్చిన పాలన.. కాంగ్రెస్ పార్టీదేనని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని లచ్చంపేట గ్రామంలో ముఖ్యకార్యకర్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నాడు, నేడు ఎప్పుడు అధికారంలో ఉన్నా.. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధేయంగా ముందుకు సాగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కాకముందే.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు పూర్తిస్థాయిలో కృషి చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, శాసన సభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల కోసం ఎన్నికల కమిషనర్తో అనుమతులు తీసుకని కొన్ని పథకాలను అమలు చేసినట్లు ఆయన తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు నేడు ప్రగాల్భాలు పలుకుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని పేద ప్రజలు.. నేడు ఎలా గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జలాడం న్యాయం కాదన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా నిలిచిందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఎంపీటీసీ సత్యనారాయణరెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, కొందుర్గు మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, రాము యాదవ్, జైపాల్, వేణు, భాస్కర్, అర్షద్, ఆజం, రవి, రాంచంద్రయ్య, యాదిరెడ్డి, నర్సింహులు, నాగేందర్, శ్రీకాంత్, వెంకటేష్, అంజి తదితరులు పాల్గొన్నారు.