కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:18 AM
కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్టు చేసిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మల్గూడలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
నలుగురు అరెస్టు, రూ15 వేలు స్వాధీనం
ఆదిభట్ల, మార్చి 3 : కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురిని అరెస్టు చేసిన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్మల్గూడలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బాలాపూర్ మండలం కుర్మల్గూడ శివారులో కోళ్ల పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఆదిభట్ల ఎస్ఐ వెంకటేష్ అధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. కోళ్ల పందాలలో పాల్గొన్న తన్నీరు శివ, మీసాల ఆంజనేయులు, బచ్చలకూర జంగయ్య, బండి రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15 వేలు, మూడు పందెం కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.