Share News

కొర్విచెడ్‌లో గొడవ.. ఇరువర్గాలపై కేసు

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:52 PM

గొడవపడి దాడికి దిగిన కేసులో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు బషీరాబాద్‌ ఎస్‌ఐ గఫార్‌ మంగళవారం తెలిపారు.

కొర్విచెడ్‌లో గొడవ.. ఇరువర్గాలపై కేసు

బషీరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గొడవపడి దాడికి దిగిన కేసులో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు బషీరాబాద్‌ ఎస్‌ఐ గఫార్‌ మంగళవారం తెలిపారు. కొర్విచెడ్‌ గ్రామానికి చెందిన మాలశేఖర్‌, మాల శ్రీనివాస్‌, మాల వెంకటప్పలు, మరో వర్గం మాల శ్రీనివాస్‌, మాల నర్సింహులు సోమవారం రాత్రి ఆకారణంగా ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 11:52 PM