ప్రభుత్వ భూమిలో ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Mar 24 , 2024 | 11:40 PM
మండల పరిధిలోని మన్సాన్పల్లి సర్వే నంబర్ 140 లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టిన గోడలను శనివారం రాత్రి రెవెన్యూ అధికారులు జేసీబీలతో కూల్చివేశారు.
మహేశ్వరం, మార్చి 24 : మండల పరిధిలోని మన్సాన్పల్లి సర్వే నంబర్ 140 లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టిన గోడలను శనివారం రాత్రి రెవెన్యూ అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. ఆర్డీవో సూరజ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కబ్జాచేస్తే ఉపేక్షించేదిలేదని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి వాటిల్లో బోర్డులు ఏర్పాటు చేసి పరిరక్షిస్తామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించినా, నిర్మాణాలు చేపట్టినా వాటిని తొలగించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుటంటామని ఈ సందర్భంగా ఆర్డీవో హెచ్చరించారు.