బైక్ను ఢీకొన్న కారు.. వ్యక్తికి తీవ్రగాయాలు
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:21 AM
కారు బైక్ను ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలోని నర్సాయపల్లి గ్రామ సమీపాన బుధవారం చోటుచేసుకొంది.
మాడ్గుల, జనవరి 10 : కారు బైక్ను ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలోని నర్సాయపల్లి గ్రామ సమీపాన బుధవారం చోటుచేసుకొంది. నర్సాయపల్లి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల గ్రామానికి చెందిన ఏనుక అర్జున్ కొల్కులపల్లి నుంచి నర్సాయపల్లి వైపు వస్తుండగా అదే గ్రామానికి చెందిన అన్నేపాక మహేష్ కారులో నర్సాయపల్లి నుంచి కొల్కులపల్లి వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో బైక్ను ఢీకొట్టాడు. దాంతో ఏనుక అర్జున్ తలకు తీవ్రగాయాలయ్యాయి. అతడి కాలు విరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ మాజీ ఉపసర్పంచ్ ముక్కెర రాములు అంబులెన్స్కు ఫోన్ చేసి చికిత్స నిమిత్తం మాల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదం సంభవించిన తర్వాత మహేష్ కారు ఆపకుండా పరారుకాగా, అప్పారెడ్డిపల్లి సమీపాన కారు బోల్తాపడినట్లు గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఉపేందర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ ఉపేందర్ తెలిపారు.