ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Jan 03 , 2024 | 12:49 AM
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం కొల్తూర్, నారాయణపూర్ గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణకు సుధీర్రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వజ్రే్షయాదవ్, అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి సందర్శించారు. వారు మాట్లాడుతూ.. మెరుగైన పాలనలో భాగంగానే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారన్నారు.
మూడుచింతలపల్లి, జనవరి 2: అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం కొల్తూర్, నారాయణపూర్ గ్రామాల్లో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరణకు సుధీర్రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వజ్రే్షయాదవ్, అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి సందర్శించారు. వారు మాట్లాడుతూ.. మెరుగైన పాలనలో భాగంగానే ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వత్సాలాదేవి, తహసీల్దార్ వాణిరెడ్డి, ఎంపీవో సునీత, వైస్ ఎంపీపీ శ్రీనివా్సరెడ్డి, సర్పంచ్లు శిల్పాయాదగిరి, రాంచంద్రయ్య, ఎంపీటీసీ అఖిలే్షరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులు, విష్ణుగౌడ్, నవీన్చారి, కార్యకర్తలు పాల్గొన్నారు.