పంటల నమోదు ప్రక్రియను సక్రమంగా చేపట్టాలి
ABN , Publish Date - Feb 15 , 2024 | 12:20 AM
పంటల నమోదు ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం చేవెళ్ల మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో యాసంగి పంటల సాగు నమోదు ప్రక్రియను ఆమె పరిశీలించారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి
చేవెళ్ల, ఫిబ్రవరి 14 : పంటల నమోదు ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం చేవెళ్ల మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో యాసంగి పంటల సాగు నమోదు ప్రక్రియను ఆమె పరిశీలించారు. అనంతరం చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఏడీఏ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రైతులు సాగుచేసిన పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేయించాలన్నారు. రైతులు పంటల సాగు వివరాలు నమోదు చేయించకపోతే ఽధాన్యం కొనుగోలు సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆమె తెలిపారు.