ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
ABN , Publish Date - Feb 01 , 2024 | 11:23 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన గురువారం రాత్రి నజీరాబాద్ శివారులో చోటుచేసుకుంది.
పరిగి, ఫిబ్రవరి 1: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన గురువారం రాత్రి నజీరాబాద్ శివారులో చోటుచేసుకుంది. మండలంలోని పొల్కంపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి మొగిలిగిద్ద శివకుమార్(21), బీటెక్ విద్యార్థి బాయికాడి సాయితేజ(22), పోతర్ల సాయికుమార్లు ముగ్గురు కలిసి బైక్పై పరిగి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో రంగాపూర్ నుంచి పరిగి వైపు వస్తున్న టాటా ఏసీ వాహనం నజీరాబాద్ వద్ద ఎదురెదురుగా వస్తూ ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న మొగిలిగిద్ద శివకుమార్, బాయికాడి సాయితేజలు అక్కడికక్కడే మృతి చెందారు. పోతర్ల సాయికుమార్కు గాయాలు కాగా, పరిగి అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరిగి సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.