చేవెళ్ల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:29 AM
గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి అన్నారు. చేవెళ్ల గ్రామంలోని రజక నగర్ కాలనీల్లో రజక సంఘం భవన నిర్మాణాన్ని 166 గజాల్లో దాదాపు రూ.25 లక్షల సొంత నిధులతో సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్ చేపడుతున్నారు.
చేవెళ్ల, జనవరి 6 : గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి అన్నారు. చేవెళ్ల గ్రామంలోని రజక నగర్ కాలనీల్లో రజక సంఘం భవన నిర్మాణాన్ని 166 గజాల్లో దాదాపు రూ.25 లక్షల సొంత నిధులతో సర్పంచ్, పీఏసీఎస్ చైర్మన్ చేపడుతున్నారు. ఈమేరకు శనివారం వారు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలు, ప్రభుత్వాలకు సంబంధం లేకుండా సొంత నిధులతో రజక భవన్ నిర్మాణం పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఉపసర్పంచ్ యాదయ్య, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, వార్డుసభ్యులు జంగనోళ్ల హరికృష్ణ, మల్గారి మల్లారెడ్డి, యువజన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ వార్డుసభ్యుడు వై. శ్రీనివాస్, రజక సంఘం మండలాధ్యక్షుడు సి.శ్రీనివాస్, నాయకులు వినోద్కుమార్, కుమార్, రాములు, పెంటయ్య, మల్లేశ్, శివకుమార్, పాండు, బాలు, వెంకటేశ్, వెంకటయ్య, శ్రీనివాస్, లక్ష్మయ్య, గవ్వల శేఖర్, మల్లేశ్ కాలనీవాసులు తదితరులు ఉన్నారు.