Share News

ఆర్టీసీ బస్సులు నడపాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:14 PM

మండలంలో ఆయా గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను వెంటనే పునఃప్రారంభించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ బస్సులు నడపాలి

- సింగారం చౌరస్తాలో విద్యార్థుల రాస్తారోకో

- గంటపాటు నిలిచిపోయిన వాహనాలు

నారాయణపేటరూరల్‌, జూలై 26: మండలంలో ఆయా గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను వెంటనే పునఃప్రారంభించాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో మండలంలోని సింగారం చౌరస్తాలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా పీడీఎస్‌యూ నాయకులు మాట్లాడుతూ మండల పరిధిలోని కోటకొండ, అభంగాపూర్‌, బండగొండ, తిర్మలాపూర్‌, గనిమోని బండ, బూనేడు గ్రామాలకు ఇదివరకే నడిచే బస్సులను నిలిపివేయడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వర్షాకాలం విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేక తీవ్ర అవస్థ ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే బస్సులను తిరిగి ప్రారంభించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. దాదాపు గంటపాటు రాస్తారోకో చేయడంతో పేట ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న ఆర్టీసీ డిపో ఇన్‌చార్జి అలివేలు బస్సులు నడిపిస్తామని హామీనివ్వడంతో రాస్తారోకో విరమింపజేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్‌, పీవైఎల్‌ సలీం, పీడీఎస్‌యూ వెంకటేశ్‌, మహేష్‌, సురేష్‌, విఠల్‌పాల్‌, లక్ష్మణ్‌, మోహన్‌, భవాని, నందిని, గీత, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:14 PM