మాజీ సీఎస్ సోమేశ్కు రూ.లక్షల్లో రైతుబంధు
ABN , Publish Date - Feb 01 , 2024 | 03:30 AM
మాజీ సీఎస్ సోమేశ్కుమార్ భూవ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో తన భార్య పేరుతో కొనుగోలు చేసిన 25 ఎకరాల 19 గుంటల భూమి పూర్తిగా గుట్టలు, రాళ్లతో నిండి ఉంటుంది.
సాగుకు పనికిరాని భూమికి మంజూరు
హైదరాబాద్, జనవరి 31(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎస్ సోమేశ్కుమార్ భూవ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో తన భార్య పేరుతో కొనుగోలు చేసిన 25 ఎకరాల 19 గుంటల భూమి పూర్తిగా గుట్టలు, రాళ్లతో నిండి ఉంటుంది. సాగుకు అనుకూలంగా లేకపోయినా రైతు బంధు కింద రూ.14లక్షల సాయం ఆయన ఖాతాల్లో పడటం గమనార్హం.