యూపీ, మహారాష్ట్ర ప్రచారానికి రాష్ట్ర బీజేపీ నేతలు
ABN , Publish Date - May 15 , 2024 | 03:05 AM
తెలంగాణలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు ఇతర రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల ప్రచారానికి
తెలంగాణలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు ఇతర రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. వచ్చే నెల 1వ తేదీ వరకు ఇతర రాష్ట్రాల్లోని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వారు ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ నాలుగు రోజుల పాటు యూపీలో ప్రచారం నిర్వహించనున్నారు. వారాణసిలో ప్రచారం నిమిత్తం ఆయన బుధవారం ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు. అనంతరం మహారాష్ట్ర, ఢిల్లీలో ఆయన పర్యటించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు యూపీలో ప్రచారం చేయనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రెండు, మూడు రోజుల్లో వారాణసి వెళ్లనున్నారు.