Share News

Telangana: ప్రతీ కేసులో ప్రతివాదిగా సీఎస్‌ వద్దు: ప్రభుత్వం

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:17 AM

ప్రతీ కేసులో ప్రతివాది(రెస్పాండెంట్‌)గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని చేర్చడం తగదని, ప్రధాన కార్యదర్శికి ఏ మాత్రం సంబంధం లేని కేసుల నుంచి సీఎ్‌సను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను కోరింది.

Telangana: ప్రతీ కేసులో ప్రతివాదిగా సీఎస్‌ వద్దు: ప్రభుత్వం

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రతీ కేసులో ప్రతివాది(రెస్పాండెంట్‌)గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)ని చేర్చడం తగదని, ప్రధాన కార్యదర్శికి ఏ మాత్రం సంబంధం లేని కేసుల నుంచి సీఎ్‌సను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను కోరింది. ఈమేరకు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ముఖ్యకార్యదర్శులు/కార్యదర్శులు/ప్రత్యేక కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతీ కేసులో ప్రతివాదిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉండటంతో సీఎ్‌సలను న్యాయస్థానాలు కోర్టుకు ఈడ్చుతున్నాయని, గత పదేళ్లుగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌-166 ప్రకారం జారీ చేసిన బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ఈ విధానం కొనసాగుతోందని గుర్తించారు. దాంతో తక్షణమే ఆయా కేసుల్లో, అందులోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏ మాత్రం సంబంధం లేని కేసుల నుంచి ప్రతివాదిగా తొలగించడానికి వీలుగా అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ), ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ)లతో సంప్రదింపులు జరిపి... హైకోర్టు రిజిస్ట్రార్‌ను కలిసి తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

Updated Date - Jun 13 , 2024 | 03:17 AM