Share News

మిడ్‌వైఫరీ శిక్షణలో తెలంగాణ టాప్‌

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:56 AM

మిడ్‌వైఫరీ శిక్షణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, రాష్ట్రంలో మరిన్ని మిడ్‌వైఫరీ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

మిడ్‌వైఫరీ శిక్షణలో తెలంగాణ టాప్‌

వైద్య మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, మార్చి11 (ఆంధ్రజ్యోతి): మిడ్‌వైఫరీ శిక్షణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, రాష్ట్రంలో మరిన్ని మిడ్‌వైఫరీ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేశాఖ ఆధ్వర్యంలో రూ.1.50 కోట్లతో ఆధునికీకరించిన భవనంలో నేషనల్‌ మిడ్‌వైఫరీ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను మంత్రి ప్రారంభించారు. మిడ్‌ వైఫరీలో 18 నెలల కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లను మంత్రి దామోదర ప్రదానం చేశారు. రాష్ట్రంలో నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటుపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌, డీఎంఈ డాక్టర్‌ వాణి, టీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 03:56 AM