ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యం

ABN, Publish Date - Oct 21 , 2024 | 01:55 PM

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. ఢిల్లీలో రోజు రోజుకు గాలి నాణ్యత పడిపోతూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ప్రతి ఏడాది చలికాంలో ఢిల్లీ వాసులు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడతారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. ఢిల్లీలో రోజు రోజుకు గాలి నాణ్యత పడిపోతూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ప్రతి ఏడాది చలికాంలో ఢిల్లీ వాసులు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడతారు. అయితే ఈ ఏడాది మరింత ముందుగానే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీంతో దీపావళి పండుగకు ముందే వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.


చలి తీవ్రత పెరగడం.. వాయు వేగం తగ్గడంతో ఢిల్లీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి తగ్గిపోతోంది. పంజాబ్, హరియాణలో పంట వ్యార్థాల దహనం వల్ల రాజధాని నగరం ఢిల్లీని పొగ అలిమేస్తుంది. దీంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కళ్లు మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఘజియాబాద్‌లో 265, నోయిడాలో 243, గ్రేటర్ నోయిడాలో 228 సహా పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత ఆద్వానంగా ఉన్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే లాఠీ చార్జ్ చేశాం: డీసీపీ

పవన్ కల్యాణ్‌పై రోజా కామెంట్స్..

తిరుమల కొండపై హెలికాప్టర్ కలకలం

మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు అరెస్ట్..

పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 21 , 2024 | 01:55 PM