తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు..

ABN, Publish Date - Sep 20 , 2024 | 09:40 AM

తిరుమల: కలియుగ దైవం వేంకటేశ్వరుడికి ముడుపుకడితే కోరికలు నెరవేరతాయని తరతరాల నమ్మిక ఇష్టదైవానికి నిలువు దోపిడీ ఇచ్చుకుని.. అమిత ఇష్టంగా లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. కానీ ఆ దైవాన్ని సయితం నిలువు దోపిడీ చేసి ఇష్ట లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడి ఘోర అపచారానికి పాల్పడ్డం..

తిరుమల: కలియుగ దైవం వేంకటేశ్వరుడికి ముడుపుకడితే కోరికలు నెరవేరతాయని తరతరాల నమ్మిక ఇష్టదైవానికి నిలువు దోపిడీ ఇచ్చుకుని.. అమిత ఇష్టంగా లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. కానీ ఆ దైవాన్ని సయితం నిలువు దోపిడీ చేసి ఇష్ట లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడి ఘోర అపచారానికి పాల్పడ్డం.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినియోగించారని తేలడం శ్రీవారి భక్తకోటిని దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. ఇదేం ఘోరం గోవిందా అంటూ అశేష భక్త కోటి ఆవేదన చెందుతున్నారు.


శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తుంటారు. హిందూ భక్తులకు అత్యంత ఇష్ట ప్రసాదం అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వినియోగించారని తేలడం శ్రీవారి భక్తకోటని దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. అదే సమయంలో ఎంతోకాలంగా నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తున్న తమను టీటీడీ అధికారులు కావాలని పక్కన పెట్టారని కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ ఆరోపించడం దీనికి బలం చేకూర్చింది. అప్పట్లో టీటీడీ యంత్రాంగం మొండిగా ముందుకెళ్లడంతో భక్తులు, హిందూ ధర్మ ప్రచారకులు, ప్రతిపక్ష నేతలూ సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మినహా మరేమీ చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నెయ్యి నాణ్యతను పరీక్షించడంతో కల్తీ గుట్టు రట్టయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ కేబినెట్ సమావేశం నేడు..

ఆ ఇద్దరికి త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు..

ఇదేం ఘోరం గోవిందా

తెగిపడుతున్న ఫ్యాను రెక్కలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 20 , 2024 | 09:40 AM