సింగరేణిలో మరో నల్ల చట్టం..

ABN, Publish Date - Oct 01 , 2024 | 12:42 PM

సింగరేణిలో యాజమాన్యం మరో నల్ల చట్టం తీసుకువచ్చింది. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండానే దానిని అమలు చేసింది. ఎల్లో, రెడ్ కార్డుల పేరుతో తీసుకు వచ్చిన ఈ కొత్త సర్క్యూలర్‌తో కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

వరంగల్: సింగరేణి యాజమాన్యం తీసుకువచ్చిన కొత్త రూల్స్ కార్మిక వర్గంలో ధడ పుట్టిస్తున్నాయి. కార్మికుల ప్రమేయం లేకుండా అమలు చేస్తున్న నయా సర్క్యిలర్ కోల్డ్ బెల్టు సెగలు రేపుతోంది. నల్లబంగారం వెలికి తీసే చీకటి సూర్యులను అంతగా టెన్షన్ పెడుతున్న కొత్త నిబంధనలు ఏంటి..


సింగరేణిలో యాజమాన్యం మరో నల్ల చట్టం తీసుకువచ్చింది. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండానే దానిని అమలు చేసింది. ఎల్లో, రెడ్ కార్డుల పేరుతో తీసుకు వచ్చిన ఈ కొత్త సర్క్యూలర్‌తో కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గనిలో కార్మికుడు తప్పు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా.. మొదట ఎల్లో కార్డు పేరుతో కార్మికుడి సెల్‌ఫోన్‌కు మెసెజ్ పంపుతారు. ఇలా రెండు, మూడు సార్లు ఈ మెసేజ్ తర్వాత రెడ్ కార్డు మెసేజ్ వస్తుంది. అనంతరం కార్మికుడిపై చర్యలకు సిద్ధం చేస్తారు. కార్మికుడు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి కూడా ఉండదు.


ఈ వార్తలు కూడా చదవండి..

కర్నాటకలో ఏడీజీ వర్సెస్ కుమారస్వామి

నటుడు గోవింద ఇంట్లో గన్ మిస్ ఫైర్ ..

కూకట్‌పల్లిలో బతుకమ్మ సంబరాలు

బొబ్బిలిలో డ్రగ్స్ అవగాహన సదస్సు

విజయవాడలో 'సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 01 , 2024 | 12:42 PM