కారు దిగనున్న మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!

ABN, Publish Date - Jul 23 , 2024 | 10:05 AM

మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కారు పార్టీ ఖాళీ అయ్యే అవకాశముంది. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఒకరు కండువా మార్చేశారు. గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వంతు వచ్చింది.

మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కారు పార్టీ ఖాళీ అయ్యే అవకాశముంది. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఒకరు కండువా మార్చేశారు. గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వంతు వచ్చింది. ‘మా సారు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎంత చెబితే అంత’ అంటున్నారు. ఇద్దరూ జాయింట్‌గా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకునే ప్లాన్‌లో ఉన్నారట.. ఇప్పటికే ఎమ్మెల్సీ చల్లా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చలు జరిపారు. దీంతో ఇద్దరూ ఏ క్షణంలోనైనా కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యే అవకాశముంది.


సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ బీఆర్ఎస్ జీరో స్ట్రాటజీని పాలమూరు నుంచే ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాలకు గానూ 12 కాంగ్రెస్ గెలుచుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కారు పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ గెలిస్తే.. పాలమూరు పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఎంపీగా డీకే అరుణ విజయం సాధించారు. సొంత జిల్లాలో బీఆర్ఎస్‌కు షాకివ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి.. క్యాడర్ వ్యతిరేకించిన గద్వాల్ కారుపార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుని తన నిర్ణయమే సుప్రీం అని తేల్చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్

దేశంలో భారీగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం

ఏపీలో రెండు షాకింగ్ ఘటనలు..

పోలవరానికి 12,157 కోట్లివ్వండి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 23 , 2024 | 10:05 AM