Live..: ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ABN, Publish Date - Jul 24 , 2024 | 10:17 AM

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభమైంది. 10 గంటల వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభమైంది. 10 గంటల వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అనంతరం ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు బిల్లును సభలో చర్చించి ఆమోదం తెలపనుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దు బిల్లుపై చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై 11:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.


అంతకుముందు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్‌ శవ రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి కోసం, నిధుల కోసం ఢిల్లీ వెళ్లారని, రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చారన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు బాబాయి హత్య నుండి బయటపడడానికి...కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్లారని ఎద్దేవా చేశారు. జగన్ రాష్ట్రం పరువు ఢిల్లీలో తాకట్టు పెట్టారని జీవి ఆంజనేయులు దుయ్యబట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దొరికిన రెండు బస్తాల డాక్యుమెంట్లు..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..

షన్ రెడ్డి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉంది: సీఎం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 24 , 2024 | 10:17 AM