ముంబయిలో రెచ్చిపోతున్న మాఫియా గ్యాంగ్..

ABN, Publish Date - Oct 13 , 2024 | 09:26 PM

దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ (డీ గ్యాంగ్), మాఫియా దెబ్బకి కొన్నాళ్ల క్రితం వరకూ ముంబయి చిగురుటాకులా వణికిపోయేది. పట్టపగలే కాల్పులతో మార్మోగి పోయేది.

ఇంటర్నెట్ డెస్క్: దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ (డీ గ్యాంగ్), మాఫియా దెబ్బకి కొన్నాళ్ల క్రితం వరకూ ముంబయి చిగురుటాకులా వణికిపోయేది. పట్టపగలే కాల్పులతో మార్మోగి పోయేది. బాలీవుడ్ సినిమాలను సైతం మాఫియా నిర్మిస్తూ రెచ్చిపోయేది. వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా మన దేశ ఆర్థిక రాజధాని ఉండేది. కొంతకాలంగా పరిస్థితి మారింది. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ అరాచకాలు కొంత తగ్గాయని భావిస్తున్న తరుణంలో మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య ఒక్కసారిగా కలకలం రేపింది. సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Updated at - Oct 13 , 2024 | 09:26 PM