సీఎం జగన్ సిద్ధం సభకు బ్రేక్

ABN, Publish Date - Feb 29 , 2024 | 08:36 AM

అమరావతి: అంతన్నారు.. ఇంతన్నారు.. 4 వందల ఎకరాల్లో సభ అన్నారు.. ఆరు జిల్లాల పరిధిలో 15 లక్షల మంది జనం వస్తారన్నారు.. మేనిఫేస్టోలో ప్రకటిస్లామని అన్నారు.. చివరకు తుస్సు మనిపించారు.

అమరావతి: అంతన్నారు.. ఇంతన్నారు.. 4 వందల ఎకరాల్లో సభ అన్నారు.. ఆరు జిల్లాల పరిధిలో 15 లక్షల మంది జనం వస్తారన్నారు.. మేనిఫేస్టోలో ప్రకటిస్లామని అన్నారు.. చివరకు తుస్సు మనిపించారు. సీఎం జగన్ నిర్వహిస్తున్న చివరి సిద్ధం సభ బాపట్ల జిల్లా, అద్దంకి పరిధిలోని మేదరమెట్ల వద్ద మార్చి 3న జరుగుతుందని వైసీపీ అట్టహాసంగా ప్రకటించింది. అయితే జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు పార్టీకి అనుకూలంగా లేవనే తత్వం బోధపడిందో.. నేతల మధ్య సమన్వయం లోపంతో జన సమీకరణ సాధ్యం కాదు అనే అనుమానం కలిగిందో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు పెట్టే సభ ప్లాప్ అయితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని భయపడ్డారు. సరైన కారణాలు చెప్పకుండనే సిద్ధం సభను మార్చి 3 నుంచి 10కు వాయిదా వేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 29 , 2024 | 08:36 AM