Kakinada: వరద బాధితులకు చంద్రబాబు భరోసా

ABN, Publish Date - Sep 12 , 2024 | 07:45 AM

తూ.గో. జిల్లా: కాకినాడలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వరద ముంపుకు గురైన కిర్లంపూడి మండలం, రాజుపాలెం గ్రామంలో పర్యటించారు. ఏలేరు కాలవకు గండి పడి రాజుపాలెం గ్రామం ఇంకా వరద ముంపులోనే ఉంది.

తూ.గో. జిల్లా: కాకినాడలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వరద ముంపుకు గురైన కిర్లంపూడి మండలం, రాజుపాలెం గ్రామంలో పర్యటించారు. ఏలేరు కాలవకు గండి పడి రాజుపాలెం గ్రామం ఇంకా వరద ముంపులోనే ఉంది. బాధితులను పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు జేసీబీ ఎక్కి గ్రామంలో తిరిగారు. ముంపులో చిక్కుకున్న ఇళ్లను పరామర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బాధితులు అధైర్యపడొద్దని, ప్రతి ఒక్కరికి సాయం చేస్తామని భరోసా ఇచ్చారు.


‘‘ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.10వేలు సాయం చేస్తా.. తక్షణం దుస్తులు పంపిణీ చేయిస్తా.. పంటలు నష్టపోయిన అన్నదాతలకు హెక్టారుకు రూ. 25వేల సాయం, ఎరువులు, పొటాషియం అందిస్తా. ఇళ్లు దెబ్బతిన్న వారికి ఇళ్లు కట్టిస్తా ను’’ అని సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. ప్రతిఒక్కరికీ సాధ్యమైనంత వేగంగా సాయం పంపిణీ చేయిస్తామని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు షాక్..

వారికి రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 12 , 2024 | 07:47 AM