అప్పులు తగ్గించి.. అభివృద్ధిపై సీఎం ఫోకస్..

ABN, Publish Date - Aug 25 , 2024 | 07:23 AM

అమరావతి: ఆర్థిక పరిస్థితులను క్రమబద్దీకరించడం.. ఖర్చులను తగ్గించుకుని అభివృద్ధి, సంక్షేమానికి సమపాలనలో నిధులు వెచ్చించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అప్పులు తగ్గించి.. ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. కూటమి ప్రభుత్వం ఐదు వారాలుగా అప్పులు తీసుకోవడం లేదు.

అమరావతి: ఆర్థిక పరిస్థితులను క్రమబద్దీకరించడం.. ఖర్చులను తగ్గించుకుని అభివృద్ధి, సంక్షేమానికి సమపాలనలో నిధులు వెచ్చించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అప్పులు తగ్గించి.. ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. కూటమి ప్రభుత్వం ఐదు వారాలుగా అప్పులు తీసుకోవడం లేదు. వస్తున్న ఆదాయంతోనే జీతాలు, పెన్షన్‌లు చెల్లిస్తోంది.


ఏపీలో గత నాలుగున్నర ఏళ్లుగా శుక్రవారం వచ్చిందంటే సెక్యూరిటీ బాండ్ల వేలం కోసం ఇండెంట్ పెట్టడం.. మంగళవారం రిజర్వు బ్యాంక్ వద్ద జరిగే బాండ్ల ఆక్షన్‌లో పాల్గొని సాయంత్రానికి అప్పు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఎఫ్ఆర్‌బీఎంలో ఇచ్చే లిమిట్స్ దాటి గత నాలుగు సంవత్సరాల కాలంలో కేంద్రం అదనపు పరిమితులను కూడా మంజూరు చేసింది. దీంతో జగన్ ప్రభుత్వం అందినకాడికి అప్పు తెచ్చుకుంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో అప్పు తీసుకురానిదే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పింఛనుకు కొత్త పథకం

ఆరోగ్య ధీమా.. అందరికీ బీమా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 25 , 2024 | 07:23 AM